Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:54 PM

ధనుర్వాసం వేళ గోదాదేవి పల్లకి సేవ… భక్తుల తాకిడి

ధనుర్వాసం వేళ గోదాదేవి పల్లకి సేవ… భక్తుల తాకిడి

ధనుర్వాసం వేళ గోదాదేవి పల్లకి సేవ… భక్తుల తాకిడి
December 20, 2025 05:11 PM 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధనుర్వాసం సందర్భంగా గోదాదేవి పల్లకి సేవ… బోగారంలో భక్తి పారవశ్యం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

ధనుర్వాసం మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గోదాదేవి ఆండాళ్ అమ్మవారి పల్లకి సేవ – నగర సంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు సాగుతూ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది.

గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ, రామాలయం, రేణుక ఎల్లమ్మ ఆలయాల గుండా గ్రామపంచాయతీ కార్యాలయం వరకు, అక్కడి నుంచి వికాస్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాలను ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు నిత్యానందం, రామాలయ అర్చకుడు జెళ్లా నిరంజన్, రామన్నపేట చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ భజన మండలి భక్త బృందం, గ్రామ మహిళలు, చిన్నా-పెద్దా తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నగర సంకీర్తనతో గ్రామాన్ని భక్తిమయంగా మార్చారు.

చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ధనుర్వాసం అత్యంత పవిత్రమైన మాసమని, దైవానికి ఇష్టమైన ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఆలయ దర్శనాలు చేయడం శ్రేష్టమని అన్నారు. బోగారం గ్రామంలో గోదాదేవి పల్లకి సేవ నిర్వహించడం గ్రామానికి ఎంతో మంగళకరమని, అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారులు, ఆంజనేయ స్వామి భక్త బృందం, సీతారామచంద్ర స్వామి భక్త బృందం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News