ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
Editor Desk
రైతుల డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయా? ట్యాబ్ ఎంట్రీలపై కలెక్టర్ ఆరా
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? ఈలోపు కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వాలి కదా” అంటూ అధికారులను ప్రశ్నించారు.
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా అనే అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, చెల్లింపులు తక్షణమే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, రోజువారీ పురోగతిపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి