Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:48 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
December 19, 2025 06:49 PM 1,560 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రైతుల డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయా? ట్యాబ్ ఎంట్రీలపై కలెక్టర్ ఆరా
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? ఈలోపు కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వాలి కదా” అంటూ అధికారులను ప్రశ్నించారు.

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా అనే అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, చెల్లింపులు తక్షణమే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, రోజువారీ పురోగతిపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News