Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
December 19, 2025 06:49 PM 1,571 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రైతుల డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయా? ట్యాబ్ ఎంట్రీలపై కలెక్టర్ ఆరా
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? ఈలోపు కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వాలి కదా” అంటూ అధికారులను ప్రశ్నించారు.

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా అనే అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, చెల్లింపులు తక్షణమే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, రోజువారీ పురోగతిపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News