దుఃఖంలో తోడుగా నిలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం
దుఃఖంలో తోడుగా నిలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం
స్థానికం బృందం
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి: ఎమ్మెల్యే వేముల వీరేశం
స్థానికం ప్రతినిధి
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల మహేందర్ రెడ్డి సతీమణి చామల అరుణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి దశదిన కర్మ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అలాగే నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామానికి చెందిన బీరవోలు దయాకర్ రెడ్డి గారి మాతృమూర్తి బీరవోలు శకుంతలమ్మ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తన మానవీయతను చాటుకున్నారని స్థానికులు ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి