ధాతల సహాయం మరువలేనిది – సర్పంచ్ విక్రమ్
ధాతల సహాయం మరువలేనిది – సర్పంచ్ విక్రమ్
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో కోతుల నివారణకు చేయూత
ఇంద్రపాలనగరంలో కోతుల సమస్య నివారణకు అందిన ధాతల సహాయం మరువలేనిదని గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ అన్నారు. సర్పంచ్ అభ్యర్థన మేరకు గ్రామంలో కోతుల నివారణ కోసం కోతులు పట్టే బోన్ల తయారీకి మందడి విద్యాసాగర్ రెడ్డి రూ.10,116 విరాళంగా అందజేశారని తెలిపారు.
గ్రామంలో కోతుల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విరాళం ఎంతో ఉపయోగకరంగా మారిందని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, పంచాయతీ సిబ్బంది ఎండీ అమినొద్దిన్, మంటి అంజయ్య, నాగరాజు, ఈర్లపల్లి మల్లయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగణబోయిన గణేష్, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, మందడి శ్రీధర్ రెడ్డి, కొమ్మగోని సంజీవ, గర్ధాస్ కరుణాకర్, సింగణబోయిన దశరద, మల్లం శ్రీరాములు, గర్ధాస్ పాండరి, గర్ధాస్ శ్రీకాంత్, సింగణబోయిన ఆంజనేయులు, గర్ధాస్ సతీష్, గర్ధాస్ మహేష్, రాధారపు నర్సింహా, శ్రీరామ్ సంతోష్, భోదాస్ నరేష్, భోదాస్ రవి, బోనగిరి మహేష్, బోనగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి ఇలాంటి సహకారం అందించాలని సర్పంచ్ విక్రమ్ గ్రామస్తులను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి