Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:14 PM

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి
15-02-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని డిమాండ్

రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత పనివారల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడి అనేక చిరస్మరణీయ విజయాలు సాధించారని తెలిపారు.

ధర్మబిక్షం సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు ఆయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరం యువతకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జయంతి వేడుకల్లో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, బాలగోని నరసింహ, కూనూరు కృష్ణ, వీరమల్ల ముత్తయ్య, బత్తుల సత్తయ్య, గుండు లింగయ్య, గోపగోని మల్లయ్య, భూపతి నరసింహ, వీరమల్ల వెంకటయ్య, పల్లె మల్లేష్, ఆకిటి స్వామి, వీరమల్ల నరసింహ, వీరమల్ల శేఖర్, గోపగోని గోపాల్, గిరకల శంకరయ్య, లింగస్వామి శంకరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

Article Image

సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని డిమాండ్

రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత పనివారల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడి అనేక చిరస్మరణీయ విజయాలు సాధించారని తెలిపారు.

ధర్మబిక్షం సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు ఆయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరం యువతకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జయంతి వేడుకల్లో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, బాలగోని నరసింహ, కూనూరు కృష్ణ, వీరమల్ల ముత్తయ్య, బత్తుల సత్తయ్య, గుండు లింగయ్య, గోపగోని మల్లయ్య, భూపతి నరసింహ, వీరమల్ల వెంకటయ్య, పల్లె మల్లేష్, ఆకిటి స్వామి, వీరమల్ల నరసింహ, వీరమల్ల శేఖర్, గోపగోని గోపాల్, గిరకల శంకరయ్య, లింగస్వామి శంకరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News