Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:45 AM

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి
February 15, 2026 03:48 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని డిమాండ్

రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత పనివారల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడి అనేక చిరస్మరణీయ విజయాలు సాధించారని తెలిపారు.

ధర్మబిక్షం సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు ఆయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరం యువతకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జయంతి వేడుకల్లో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, బాలగోని నరసింహ, కూనూరు కృష్ణ, వీరమల్ల ముత్తయ్య, బత్తుల సత్తయ్య, గుండు లింగయ్య, గోపగోని మల్లయ్య, భూపతి నరసింహ, వీరమల్ల వెంకటయ్య, పల్లె మల్లేష్, ఆకిటి స్వామి, వీరమల్ల నరసింహ, వీరమల్ల శేఖర్, గోపగోని గోపాల్, గిరకల శంకరయ్య, లింగస్వామి శంకరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News