Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:29 AM

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి
February 15, 2026 03:48 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని డిమాండ్

రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత పనివారల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడి అనేక చిరస్మరణీయ విజయాలు సాధించారని తెలిపారు.

ధర్మబిక్షం సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు ఆయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరం యువతకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జయంతి వేడుకల్లో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, బాలగోని నరసింహ, కూనూరు కృష్ణ, వీరమల్ల ముత్తయ్య, బత్తుల సత్తయ్య, గుండు లింగయ్య, గోపగోని మల్లయ్య, భూపతి నరసింహ, వీరమల్ల వెంకటయ్య, పల్లె మల్లేష్, ఆకిటి స్వామి, వీరమల్ల నరసింహ, వీరమల్ల శేఖర్, గోపగోని గోపాల్, గిరకల శంకరయ్య, లింగస్వామి శంకరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News