Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి
March 26, 2026 08:24 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి – మినీ ట్యాంక్ బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, నికార్సైన కమ్యూనిస్టు నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ధర్మభిక్షం చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మభిక్షం జీవితం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసి పేదల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసి ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చారని గుర్తు చేశారు.

నికార్సైన కమ్యూనిస్టు నాయకుడిగా చట్టసభలను ఉద్యమ వేదికగా మార్చి ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, అలాంటి నాయకుడే ధర్మభిక్షం అని అన్నారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ధర్మభిక్షం పేరు పెట్టాలని సూచించారు. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫి ఉల్లా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News