Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 09:57 PM

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి
March 26, 2026 08:24 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి – మినీ ట్యాంక్ బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, నికార్సైన కమ్యూనిస్టు నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ధర్మభిక్షం చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మభిక్షం జీవితం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసి పేదల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసి ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చారని గుర్తు చేశారు.

నికార్సైన కమ్యూనిస్టు నాయకుడిగా చట్టసభలను ఉద్యమ వేదికగా మార్చి ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, అలాంటి నాయకుడే ధర్మభిక్షం అని అన్నారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ధర్మభిక్షం పేరు పెట్టాలని సూచించారు. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫి ఉల్లా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News