ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం
K.RAVI
సీపీఐ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో నిరసన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ధరల పెంపును నిరసిస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో హైవేపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పగిల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎలాంటి ధరల పెంపు చేయకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో చమురు నిల్వలకు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పదేపదే ధరలు పెంచడం దుర్మార్గమని అన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, బేధరకోట యాదయ్య, దాసరి మనోహర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ముప్పిడి నర్సింహా, దామ లింగస్వామి, దేశగాని శ్రీను, గోసుకొండ మహేష్, బేడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి