Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 04:07 AM

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం
May 16, 2026 02:32 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఐ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో నిరసన

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ధరల పెంపును నిరసిస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో హైవేపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పగిల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎలాంటి ధరల పెంపు చేయకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దేశంలో చమురు నిల్వలకు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పదేపదే ధరలు పెంచడం దుర్మార్గమని అన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, బేధరకోట యాదయ్య, దాసరి మనోహర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ముప్పిడి నర్సింహా, దామ లింగస్వామి, దేశగాని శ్రీను, గోసుకొండ మహేష్, బేడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News