Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை లంచ్ బాక్స్‌తో సచివాలయానికి సీఎం విజయ్.. సాధారణ ఉద్యోగిలా కొత్త పని శైలి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 03:49 PM

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం
May 16, 2026 02:32 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఐ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో నిరసన

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ధరల పెంపును నిరసిస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో హైవేపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పగిల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎలాంటి ధరల పెంపు చేయకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దేశంలో చమురు నిల్వలకు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పదేపదే ధరలు పెంచడం దుర్మార్గమని అన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, బేధరకోట యాదయ్య, దాసరి మనోహర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ముప్పిడి నర్సింహా, దామ లింగస్వామి, దేశగాని శ్రీను, గోసుకొండ మహేష్, బేడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News