Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ

ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ

ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ
January 11, 2026 05:30 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ వేదాంత భజన మందిరంలో చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల సేవా కార్యక్రమం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్‌లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో ఆదివారం భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుడారై ఉత్సవంలో భాగంగా చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతులు తమ స్వహస్తాలతో భక్తులందరికీ పాయసాన్ని అందజేసి భక్తుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కరుణాకటాక్షాలు చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రాన్ని దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, సహాయ అర్చకులు ధరూరి రాఘవాచార్యులు, సోమా సుమన్‌తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News