ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ
ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ
Biksham
శ్రీ వేదాంత భజన మందిరంలో చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల సేవా కార్యక్రమం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో ఆదివారం భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుడారై ఉత్సవంలో భాగంగా చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతులు తమ స్వహస్తాలతో భక్తులందరికీ పాయసాన్ని అందజేసి భక్తుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కరుణాకటాక్షాలు చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రాన్ని దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, సహాయ అర్చకులు ధరూరి రాఘవాచార్యులు, సోమా సుమన్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి