ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా
ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా
K.RAVI
వరి ధాన్యం కొనుగోలు సమయంలో తూకాల్లో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే తూకం వేసే సమయంలో మోసాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు నిర్వహించిన నిరసనలో ధాన్యం లోడ్ చేసిన కాంటాలను తనిఖీ చేయగా, ఒకే లారీలో 3 క్వింటాళ్ల 70 కిలోల వరకు తూకంలో తేడా బయటపడిందని తెలిపారు.రైతుల ఆందోళనతో తహసీల్దార్ సహా ప్రభుత్వ అధికారులు మార్కెట్ యార్డుకు చేరుకుని తూకాల్లో జరిగిన తేడాలను సరిచేసినట్లు చెప్పారు. అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని, తూకాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు చీర్క అలివేలు, బోరం నర్సిరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి