Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 04:49 PM

ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా

ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా

ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా
May 16, 2026 03:33 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వరి ధాన్యం కొనుగోలు సమయంలో తూకాల్లో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే తూకం వేసే సమయంలో మోసాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు నిర్వహించిన నిరసనలో ధాన్యం లోడ్ చేసిన కాంటాలను తనిఖీ చేయగా, ఒకే లారీలో 3 క్వింటాళ్ల 70 కిలోల వరకు తూకంలో తేడా బయటపడిందని తెలిపారు.రైతుల ఆందోళనతో తహసీల్దార్ సహా ప్రభుత్వ అధికారులు మార్కెట్ యార్డుకు చేరుకుని తూకాల్లో జరిగిన తేడాలను సరిచేసినట్లు చెప్పారు. అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని, తూకాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు చీర్క అలివేలు, బోరం నర్సిరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News