Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 09:04 PM

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం.. తాటికొండ సీతయ్య BRS మండలమాజీ అధ్యక్షులు

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం.. తాటికొండ సీతయ్య BRS మండలమాజీ అధ్యక్షులు

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం..  తాటికొండ సీతయ్య BRS మండలమాజీ అధ్యక్షులు
May 14, 2026 07:30 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కల్లా ల్లో ధాన్యం పోసి నెల రోజులుదాటినా ఇప్పటివరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని పూర్తిగా విఫలం చెందిందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ...లారీలు సక్రమంగా కేంద్రాలకు రాకపోవడం. లోడింగ్ చేసి పంపిన లారీ మిల్లుల వద్ద సకాలంలో దిగుమతులు కాపోవడం ములాన రైతులకు ఎదురుచూపులు తప్పక ధాన్యం కల్లా ల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందనీ. ఇది ఇలా ఉంటే ములి గే నక్క పై తాటిపండు పడ్డ చందంగా మిల్లు యజమానులు తరుగు పేరుతో తాలు పేరుతో కిలోల కొద్ది కోతలు పెడుతుండడం తో రైతు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లో అగమ్య గోచరంగా మారింది అని అన్నారు. గత పదేళ్లు kcr పాలనలో ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతు కళ్ళల్లో ఆనందంగా జీవించా మని. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిందని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారని అన్నారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలార మీరు అధికారానికి వచ్చిన రెండున్నర ఏండ్లు గా రైతుకు సంబంధించిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోతీరని అన్నారు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వక పోతిరి. రైతు బీమా రద్దు చేస్తారీ. రుణ మాఫీ నీటి మూటలాయే. కనీసం పంట వేసుకుంటే యూరియా సరిగా ఇవ్వక ఇబ్బందుల పాల్జేస్తిరి . పండిన పంటను సరిగా కొనుగోలు చేయక పోవడం లాంటి మీఅస్తవ్యస్త మైన దివాళా కోరు విధానాలతోవ్యవసాయ. రంగం పూర్తిగా ఊబి లో కూరుకుపోయిందని అన్నారు. రైతాంగం తో పాటు సమాజం లోని అన్ని వర్గాలప్రజలను దివాళా తీయించి హాయిగా అధికారంలో కులుకుతున్నారని రైతులు ఇంత గగ్గోలు పెడుతున్న మీ mla లు కానీ mp లు కానీ ఏ ఒక్కా కేంద్రాన్నైన సందర్శించి రైతుకు భరోసా కల్పించారా అని రష్మించారు..విద్యార్థులకు సంబంధించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం వలన 22లక్షల మంది విద్యార్థులు ఈరోజు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.12 ఏండ్ల కేంద్ర బీజేపీ పాలనలో ఇప్పటికీ నాలుగు సార్లు పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు నష్ట పోతున్న బీజేపీ ప్రభుత్వం నేరస్థుల పై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని అన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. లీకేజీ లో బాధ్యులైన అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని. నష్ట పోయిన విద్యార్థులకు కేంద్రం తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల నాగమల్లు, మాజీ సర్పంచ్ యాకు నాయక్, పూర్ణ నాయక్. రాములు నాయక్. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News