PRINT TIME: May 15, 2026 08:20 PM
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ
May 15, 2026 06:54 PM
49 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలోని విద్యా రైస్మిల్లులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం తూకాలు, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందాలని, తేమ, తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి