Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 09:24 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు
May 11, 2026 07:28 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా వాహనాలు, సంచులు లేకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అమ్మిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేయాలని, వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యం కల్పించాలని, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో భారీగా జొన్న సాగు జరిగినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News