ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Biksham
రైతులు దళారులను నమ్మొద్దని సూచన
సూర్యాపేట మండలంలోని గాంధీ నగర్, 13వ వార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.ధాన్యంలో తేమశాతం 17కు మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామసాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్పరాజు రమేష్, మర్రిపల్లి వెంకటేష్, రాగం విజయ్, అవిలయ్య, సైదులు, వాసు, పిఏసీఎస్ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి