Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:14 PM

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన
May 13, 2026 06:15 AM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో పాటు తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కేసీఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి, గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం, రైతులు కర్రె చంద్రశేఖర్‌, ఒగ్గు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News