Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 08:32 AM

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన
May 13, 2026 06:15 AM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో పాటు తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కేసీఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి, గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం, రైతులు కర్రె చంద్రశేఖర్‌, ఒగ్గు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News