Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌ పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 01:06 PM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం. కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం. కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం. కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా
May 12, 2026 12:12 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

15 రోజుల్లో పూర్తి కొనుగోళ్లు చేస్తామని జేసీ హామీ

నల్లగొండ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా జిల్లాలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నానన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా లారీలు లేక వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయని తెలిపారు. తేమ, నాణ్యత పేరుతో రైతుల వడ్లలో అన్యాయంగా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

దళారులు రైతులను భయపెట్టి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. కాంటాలు సకాలంలో నిర్వహించకపోవడంతో రైతులు ఎండలో, వర్షంలో రోజులు తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. మార్కెట్‌ యార్డుల్లో కాంగ్రెస్‌ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని, సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. రైతుల వడ్లలో అన్యాయ కోతలు నిలిపివేయాలని, దళారుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌.. 15 రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News