Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు
07-05-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​‘ఏసీ గదుల్లో కాదు.. రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’

చౌటుప్పల్ మార్కెట్‌లో వడ్ల కుప్పల పరిశీలన

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం, తరుగు పేరుతో కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు హరీశ్‌రావుకు వివరించారు. మార్కెట్‌లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. “నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు.. రైతుల మధ్యే నిలబడి వారి బాధలు వింటున్నా” అని వ్యాఖ్యానించారు.మాయిశ్చర్ పరీక్షలు, గన్నీ బ్యాగులు, కాంటాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిల్లుల్లో కూడా కటింగ్ పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హరీశ్‌రావు విమర్శించారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

Article Image

​‘ఏసీ గదుల్లో కాదు.. రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’

చౌటుప్పల్ మార్కెట్‌లో వడ్ల కుప్పల పరిశీలన

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం, తరుగు పేరుతో కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు హరీశ్‌రావుకు వివరించారు. మార్కెట్‌లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. “నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు.. రైతుల మధ్యే నిలబడి వారి బాధలు వింటున్నా” అని వ్యాఖ్యానించారు.మాయిశ్చర్ పరీక్షలు, గన్నీ బ్యాగులు, కాంటాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిల్లుల్లో కూడా కటింగ్ పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హరీశ్‌రావు విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News