ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్: హరీశ్రావు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్: హరీశ్రావు
K.RAVI
‘ఏసీ గదుల్లో కాదు.. రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’
చౌటుప్పల్ మార్కెట్లో వడ్ల కుప్పల పరిశీలన
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీ. హరీశ్రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం, తరుగు పేరుతో కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు హరీశ్రావుకు వివరించారు. మార్కెట్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. “నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు.. రైతుల మధ్యే నిలబడి వారి బాధలు వింటున్నా” అని వ్యాఖ్యానించారు.మాయిశ్చర్ పరీక్షలు, గన్నీ బ్యాగులు, కాంటాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిల్లుల్లో కూడా కటింగ్ పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హరీశ్రావు విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి