Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్‌లో స్టేట్ ర్యాంకులతో ఆదోని విద్యార్థినుల సత్తా నారా లోకేష్ స్ఫూర్తితో విద్యా రంగంలో ముందడుగు: దేవేంద్రప్ప బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 07:32 PM

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు
May 07, 2026 06:33 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​‘ఏసీ గదుల్లో కాదు.. రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’

చౌటుప్పల్ మార్కెట్‌లో వడ్ల కుప్పల పరిశీలన

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం, తరుగు పేరుతో కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు హరీశ్‌రావుకు వివరించారు. మార్కెట్‌లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. “నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు.. రైతుల మధ్యే నిలబడి వారి బాధలు వింటున్నా” అని వ్యాఖ్యానించారు.మాయిశ్చర్ పరీక్షలు, గన్నీ బ్యాగులు, కాంటాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిల్లుల్లో కూడా కటింగ్ పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హరీశ్‌రావు విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News