ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్కు బీజేపీ వినతి
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్కు బీజేపీ వినతి
Editor Desk
భువనగిరి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మౌలిక వసతుల కొరత, ‘తరుగు–తేమ’ పేరుతో రైతుల దోపిడీని అరికట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు గురువారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, ధాన్యం లిఫ్టింగ్ అనంతరం వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
పోచంపల్లిలో కొందరు రైస్మిల్లర్లు కుమ్మక్కై రైతులు పండించిన ధాన్యంలో అధిక కోతలు విధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, డీఎస్వో ద్వారా వివరాలు సేకరించి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ్, తుమ్మల మురళీధర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కదూరి అచ్చయ్య, చందా మహేందర్గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్, నాయకులు లక్ష్మీనారాయణ, కమిటీకారి కృష్ణ, తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మాధురి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి