Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:06 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి
May 21, 2026 08:37 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మౌలిక వసతుల కొరత, ‘తరుగు–తేమ’ పేరుతో రైతుల దోపిడీని అరికట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, ధాన్యం లిఫ్టింగ్ అనంతరం వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

పోచంపల్లిలో కొందరు రైస్‌మిల్లర్లు కుమ్మక్కై రైతులు పండించిన ధాన్యంలో అధిక కోతలు విధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, డీఎస్‌వో ద్వారా వివరాలు సేకరించి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కదూరి అచ్చయ్య, చందా మహేందర్‌గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్, నాయకులు లక్ష్మీనారాయణ, కమిటీకారి కృష్ణ, తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మాధురి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News