భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
K.RAVI
చౌటుప్పల్లో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోశిక లలితా చంద్రభూషణ్ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమాన్ పూజ, అభిషేకం విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, ఉపాధ్యక్షులు గోషిక బాలాజీ, ప్రధాన కార్యదర్శి గోశిక బాల నరసింహ, సహాయ కార్యదర్శి గోలి శ్రీనివాస్, బడుగు సుజాత, సాంస్కృతిక కార్యదర్శి బడుగు క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి కర్నాటి జనార్ధన్, ధర్మకర్తల మండలి సభ్యులు బడుగు శ్రీరాములు, గుర్రం వెంకటేశం, వనం ధనంజయ, గుర్రం పాండురంగ, గోశిక నరసింహ, శ్రీ భావన ఋషి కళానికేతన్ అధ్యక్షులు బడుగు బాలరాజు, ఉపాధ్యక్షురాలు బడుగు సావిత్రి, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజు, కోశాధికారి పోలోజు వెంకటచారి,
ప్రధాన అర్చకులు గంజి నరసింహులు పంతులు, గంజి అనంతరామ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి