PRINT TIME: May 26, 2026 08:55 PM
భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
January 27, 2026 04:48 AM
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, లొంకా హనుమాన్ ఆలయ సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించిన శివయ్య స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శివయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పి చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీ. రాజు, వెంకట్ యాదవ్, ప్రేమ్ సింగ్, శివ స్వాములు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి