PRINT TIME: May 12, 2026 10:23 PM
భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర
భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర
May 12, 2026 09:03 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి వారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ శోభాయాత్రలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్ర చౌటుప్పల్ పట్టణంలో భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్రను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి