దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు
దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు
Editor Desk
యాదగిరిగుట్ట:
దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండపై దుకాణాల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక భక్తుడు అన్నల్దాస్ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, పూజలు, ప్రసాదాల టికెట్ల ధరల పెంపుపై అధికారులు చూపుతున్న శ్రద్ధ, దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొండపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యాపారులు కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.
దేవస్థాన దుకాణాలను ఇతరులకు అప్పగిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని, లీజులు–సబ్లీజుల ద్వారా దేవస్థానానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇతర టెండర్లలో సరైన ధర రాకపోతే రద్దు చేసే అధికారులు, దుకాణాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కొండపై ఉన్న దుకాణాలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి