Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:10 AM

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు
14-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట:

దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండపై దుకాణాల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక భక్తుడు అన్నల్దాస్ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, పూజలు, ప్రసాదాల టికెట్ల ధరల పెంపుపై అధికారులు చూపుతున్న శ్రద్ధ, దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొండపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యాపారులు కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.

దేవస్థాన దుకాణాలను ఇతరులకు అప్పగిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని, లీజులు–సబ్‌లీజుల ద్వారా దేవస్థానానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇతర టెండర్లలో సరైన ధర రాకపోతే రద్దు చేసే అధికారులు, దుకాణాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కొండపై ఉన్న దుకాణాలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు

Article Image

యాదగిరిగుట్ట:

దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండపై దుకాణాల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక భక్తుడు అన్నల్దాస్ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, పూజలు, ప్రసాదాల టికెట్ల ధరల పెంపుపై అధికారులు చూపుతున్న శ్రద్ధ, దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొండపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యాపారులు కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.

దేవస్థాన దుకాణాలను ఇతరులకు అప్పగిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని, లీజులు–సబ్‌లీజుల ద్వారా దేవస్థానానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇతర టెండర్లలో సరైన ధర రాకపోతే రద్దు చేసే అధికారులు, దుకాణాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కొండపై ఉన్న దుకాణాలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News