Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:41 AM

దేవాలయ భూములను సర్వే చేయాలి

దేవాలయ భూములను సర్వే చేయాలి

దేవాలయ భూములను సర్వే చేయాలి
February 03, 2026 06:35 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

దేవాలయ భూములను సర్వే చేయాలి

శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గల శివాలయము శ్రీ వరవర రంగనాయక దేవాలయ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయుట కొరకు ఆర్డిఓ సూర్యనారాయణకు సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన ఊరు – మన వారసత్వం (మేరా గాన్ మేరీ దారోహర్) పథకం కింద గ్రామంలో దేవాలయ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ జాతీయ పథకం మన ఊరు – మన వారసత్వం ఆధారంగా, గ్రామ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి గ్రామ సభ తీర్మానం చేసింది. ఈ పథకం గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్, హెరిటేజ్ సైట్లు, ఆలయాలు, సంప్రదాయాలు డాక్యుమెంట్ చేయడంపై దృష్టి సారిస్తుంది.

దీని కింద గణపవరం గ్రామంలోని శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దులను అధికారిక సర్వే ద్వారా నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.

రెవెన్యూ & సర్వే శాఖ అధికారులు త్వరగా సర్వే నిర్వహించి, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని మనవి. ఇది గ్రామ వారసత్వ పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు అందజేయడానికి కీలకమైనదని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News