PRINT TIME: July 11, 2026 03:11 AM
దేశంలో మళ్లీ మండిపోతున్న ఇంధన ధరలు.. 10 రోజుల్లో నాలుగోసారి పెంపు
దేశంలో మళ్లీ మండిపోతున్న ఇంధన ధరలు.. 10 రోజుల్లో నాలుగోసారి పెంపు
May 25, 2026 06:51 AM
57 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే నాలుగోసారి ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు, ఈసారి లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 పెంచాయి. వరుస పెరుగుదలలతో సామాన్య ప్రజలపై భారం మరింత పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాలతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా ఖర్చులపై పడే అవకాశం ఉండటంతో, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి