Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:02 PM

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్
February 11, 2026 08:04 AM 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకుడు మేకల సురేష్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు మేకల సురేష్ కార్మికులకు పిలుపునిచ్చారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజీఆర్‌ఏఎం చట్ట సవరణ బిల్లుల ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా ఎల్‌బీపీలలో 100 శాతం విదేశీ పెట్టుబడిదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ప్రజా రంగ సంస్థల నిర్వీర్యానికి దారి తీస్తుందన్నారు.కార్మికుల ఉపాధి భద్రత, ప్రజలపై భారం పెంచే ఈ విధానాలను తిప్పికొట్టాలంటే సమిష్టి పోరాటమే మార్గమని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని మేకల సురేష్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News