Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:15 PM

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్
February 11, 2026 08:04 AM 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకుడు మేకల సురేష్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు మేకల సురేష్ కార్మికులకు పిలుపునిచ్చారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజీఆర్‌ఏఎం చట్ట సవరణ బిల్లుల ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా ఎల్‌బీపీలలో 100 శాతం విదేశీ పెట్టుబడిదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ప్రజా రంగ సంస్థల నిర్వీర్యానికి దారి తీస్తుందన్నారు.కార్మికుల ఉపాధి భద్రత, ప్రజలపై భారం పెంచే ఈ విధానాలను తిప్పికొట్టాలంటే సమిష్టి పోరాటమే మార్గమని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని మేకల సురేష్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News