దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్
Editor Desk
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకుడు మేకల సురేష్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు మేకల సురేష్ కార్మికులకు పిలుపునిచ్చారు.
గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజీఆర్ఏఎం చట్ట సవరణ బిల్లుల ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా ఎల్బీపీలలో 100 శాతం విదేశీ పెట్టుబడిదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ప్రజా రంగ సంస్థల నిర్వీర్యానికి దారి తీస్తుందన్నారు.కార్మికుల ఉపాధి భద్రత, ప్రజలపై భారం పెంచే ఈ విధానాలను తిప్పికొట్టాలంటే సమిష్టి పోరాటమే మార్గమని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని మేకల సురేష్ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి