Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:41 AM

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్
12-02-2026 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం

చిట్యాల మండలం, వెలిమినేడు,

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గ్రామీణ బంద్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పని జరుగుతున్న ప్రదేశాల్లో పనులను నిలిపివేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు అరూరి శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పథకానికి పేరు మార్పు చేయడం, నిధుల భారం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం ద్వారా భవిష్యత్తులో నిధుల కేటాయింపును తగ్గించి పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.


గతంలో మాదిరిగానే ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేకంగా భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లు, జాతీయ విత్తన చట్టాలు, విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని కోరారు. రైతాంగ, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం విరమించుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, పంది నరేష్, దేశగోని నరసింహ, సురకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, బొడ్డుపల్లి శ్రీను, అరూరి దుర్గయ్య, చిరగోని లింగయ్య, కందటి యాదిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్

Article Image

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం

చిట్యాల మండలం, వెలిమినేడు,

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గ్రామీణ బంద్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పని జరుగుతున్న ప్రదేశాల్లో పనులను నిలిపివేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు అరూరి శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పథకానికి పేరు మార్పు చేయడం, నిధుల భారం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం ద్వారా భవిష్యత్తులో నిధుల కేటాయింపును తగ్గించి పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.


గతంలో మాదిరిగానే ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేకంగా భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లు, జాతీయ విత్తన చట్టాలు, విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని కోరారు. రైతాంగ, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం విరమించుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, పంది నరేష్, దేశగోని నరసింహ, సురకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, బొడ్డుపల్లి శ్రీను, అరూరి దుర్గయ్య, చిరగోని లింగయ్య, కందటి యాదిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News