దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ
దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ
Biksham
46వ వార్డులో మార్పు కోసం పోలోజు మౌనికకు అవకాశం ఇవ్వాలి
సూర్యాపేట:
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తుపాకీ గుండుకు బలై వీరమరణం పొందిన కార్గిల్ యుద్ధ వీరుడు పోలోజు గోపయ్య చారి త్యాగానికి గుర్తుగా, ఆయన ఏకైక కూతురు పోలోజు మౌనిక ప్రజాసేవ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, సమాజ అభివృద్ధి కోసం తాను రాజకీయ వేదికపై పోరాటానికి సిద్ధమయ్యానని ఆమె స్పష్టం చేశారు.ఇన్నాళ్లుగా మాటలకే పరిమితమైన నాయకత్వానికి భిన్నంగా, ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి నేరుగా పని చేసే కొత్త రాజకీయానికి నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళల భద్రత, యువతకు అవకాశాలు వంటి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆదరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజకీయాలకతీతంగా నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు. విద్యావంతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డులో బిజెపి పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడుతున్న పోలోజు మౌనికకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే, 46వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు పడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి