Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ
February 04, 2026 02:48 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

46వ వార్డులో మార్పు కోసం పోలోజు మౌనికకు అవకాశం ఇవ్వాలి

సూర్యాపేట:

దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తుపాకీ గుండుకు బలై వీరమరణం పొందిన కార్గిల్ యుద్ధ వీరుడు పోలోజు గోపయ్య చారి త్యాగానికి గుర్తుగా, ఆయన ఏకైక కూతురు పోలోజు మౌనిక ప్రజాసేవ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, సమాజ అభివృద్ధి కోసం తాను రాజకీయ వేదికపై పోరాటానికి సిద్ధమయ్యానని ఆమె స్పష్టం చేశారు.ఇన్నాళ్లుగా మాటలకే పరిమితమైన నాయకత్వానికి భిన్నంగా, ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి నేరుగా పని చేసే కొత్త రాజకీయానికి నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళల భద్రత, యువతకు అవకాశాలు వంటి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆదరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజకీయాలకతీతంగా నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు. విద్యావంతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డులో బిజెపి పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడుతున్న పోలోజు మౌనికకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే, 46వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు పడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News