Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ
February 04, 2026 02:48 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

46వ వార్డులో మార్పు కోసం పోలోజు మౌనికకు అవకాశం ఇవ్వాలి

సూర్యాపేట:

దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తుపాకీ గుండుకు బలై వీరమరణం పొందిన కార్గిల్ యుద్ధ వీరుడు పోలోజు గోపయ్య చారి త్యాగానికి గుర్తుగా, ఆయన ఏకైక కూతురు పోలోజు మౌనిక ప్రజాసేవ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, సమాజ అభివృద్ధి కోసం తాను రాజకీయ వేదికపై పోరాటానికి సిద్ధమయ్యానని ఆమె స్పష్టం చేశారు.ఇన్నాళ్లుగా మాటలకే పరిమితమైన నాయకత్వానికి భిన్నంగా, ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి నేరుగా పని చేసే కొత్త రాజకీయానికి నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళల భద్రత, యువతకు అవకాశాలు వంటి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆదరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజకీయాలకతీతంగా నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు. విద్యావంతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డులో బిజెపి పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడుతున్న పోలోజు మౌనికకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే, 46వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు పడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News