Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 AM

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ

దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచే ప్రజాసేవ
February 04, 2026 02:48 PM 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

46వ వార్డులో మార్పు కోసం పోలోజు మౌనికకు అవకాశం ఇవ్వాలి

సూర్యాపేట:

దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తుపాకీ గుండుకు బలై వీరమరణం పొందిన కార్గిల్ యుద్ధ వీరుడు పోలోజు గోపయ్య చారి త్యాగానికి గుర్తుగా, ఆయన ఏకైక కూతురు పోలోజు మౌనిక ప్రజాసేవ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, సమాజ అభివృద్ధి కోసం తాను రాజకీయ వేదికపై పోరాటానికి సిద్ధమయ్యానని ఆమె స్పష్టం చేశారు.ఇన్నాళ్లుగా మాటలకే పరిమితమైన నాయకత్వానికి భిన్నంగా, ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి నేరుగా పని చేసే కొత్త రాజకీయానికి నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళల భద్రత, యువతకు అవకాశాలు వంటి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆదరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజకీయాలకతీతంగా నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు. విద్యావంతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డులో బిజెపి పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడుతున్న పోలోజు మౌనికకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే, 46వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు పడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News