దేశ అభివృద్ధికి రాజీవ్ కృషి మరువలేనిది:దేప శ్యాంసుందర్ ముదిరాజ్
దేశ అభివృద్ధికి రాజీవ్ కృషి మరువలేనిది:దేప శ్యాంసుందర్ ముదిరాజ్
K.RAVI
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సుక్క రవీందర్ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. యువతకు సాంకేతిక రంగాన్ని చేరువ చేసిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.డీ. గౌస్ ఖాన్, వార్డు సభ్యులు ఈడుదుల ఇంద్రసేన యాదవ్, పక్కిర్ వంశీధర్ రెడ్డి, ఉప్పరి అనిల్ కుమార్, అత్తపురం సంతోష్ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి పక్కిర్ ప్రభాకర్ రెడ్డి, ఆంధోళ్ మైసమ్మ, రామలింగేశ్వర స్వామి దేవాలయ డైరెక్టర్లు జొన్నగంటి దాసు, మన్నె మహేందర్ రెడ్డి, బొంతల యువరాజ్, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, దౌడి లింగస్వామి,కాంగ్రెస్ నాయకులు ఈడుదుల హరిప్రసాద్, మహ్మద్ గాలీబ్ ఖాన్, ఎం.డీ. బాబా, సిలువేరు బాలయ్య, ఈడుదుల జంగయ్య, చామట్ల ప్రభాకర్, ఈడుదుల కేశవ్ యాదవ్, ఈడుదుల పరమేష్ యాదవ్, ముదిగొండ మహేష్, చందుపట్ల సాయి నేత, మహంకాళి పృథ్వి, సందగళ్ల నవీన్ గౌడ్, షేక్ అహ్మత్, రహ్మత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి