డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు
డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు
K.RAVI
ఎల్లగిరి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా, కుమారుడు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కోటి చుక్కల అశోక్ (20), నివాసం మియాపూర్, స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, తన తండ్రి కోటి చుక్కల సుబ్రహ్మణ్యం (48)తో కలిసి స్కూటీ నంబర్ TS07AK2087పై చోడవరం నుండి హైదరాబాద్కు బయలుదేరారు.మార్గమధ్యలో ఎల్లగిరి గ్రామ శివారులోని పేదరాశి పెద్దమ్మ హోటల్ సమీపంలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి స్కూటీని ఢీకొట్టాడు. ఢీకొన్న ప్రభావంతో తండ్రీకొడుకులు ఇద్దరూ కిందపడిపోయారు. డీసీఎం వాహనం వెనుక ఎడమ టైరు సుబ్రహ్మణ్యం తలపై నుంచి వెళ్లడంతో ఆయనకు తీవ్ర రక్త గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్కు కుడి కాలి పాదానికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి