Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:17 AM

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు
19-02-2026 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎల్లగిరి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా, కుమారుడు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కోటి చుక్కల అశోక్ (20), నివాసం మియాపూర్, స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, తన తండ్రి కోటి చుక్కల సుబ్రహ్మణ్యం (48)తో కలిసి స్కూటీ నంబర్ TS07AK2087పై చోడవరం నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యలో ఎల్లగిరి గ్రామ శివారులోని పేదరాశి పెద్దమ్మ హోటల్ సమీపంలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి స్కూటీని ఢీకొట్టాడు. ఢీకొన్న ప్రభావంతో తండ్రీకొడుకులు ఇద్దరూ కిందపడిపోయారు. డీసీఎం వాహనం వెనుక ఎడమ టైరు సుబ్రహ్మణ్యం తలపై నుంచి వెళ్లడంతో ఆయనకు తీవ్ర రక్త గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌కు కుడి కాలి పాదానికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Sthanikam

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు

Article Image

ఎల్లగిరి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా, కుమారుడు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కోటి చుక్కల అశోక్ (20), నివాసం మియాపూర్, స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, తన తండ్రి కోటి చుక్కల సుబ్రహ్మణ్యం (48)తో కలిసి స్కూటీ నంబర్ TS07AK2087పై చోడవరం నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యలో ఎల్లగిరి గ్రామ శివారులోని పేదరాశి పెద్దమ్మ హోటల్ సమీపంలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి స్కూటీని ఢీకొట్టాడు. ఢీకొన్న ప్రభావంతో తండ్రీకొడుకులు ఇద్దరూ కిందపడిపోయారు. డీసీఎం వాహనం వెనుక ఎడమ టైరు సుబ్రహ్మణ్యం తలపై నుంచి వెళ్లడంతో ఆయనకు తీవ్ర రక్త గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌కు కుడి కాలి పాదానికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News