Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 01:16 AM

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు
May 11, 2026 11:52 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వడ్డెర జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దండగల మారెప్ప, ప్రధాన కార్యదర్శి గోగుల చక్రపాణి ఆంధ్రప్రదేశ్ బీసీ గ్రామీణ, పట్టణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ విశ్వ ఐఏఎస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రంలో వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చడంతో పాటు, వడ్డెర, వడ్డీలు, వడ్డీ తదితర ఉపవర్గాలన్నింటినీ ఒకే జాతిగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పేర్లు భిన్నంగా ఉన్నప్పటికీ, వీరందరూ ఒకే వడ్డెర సమాజానికి చెందిన వారేనని వివరించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో వడ్డెర జాతికి చెందిన వారు ఎస్.సి లేదా ఎస్.టి వర్గాల్లో కొనసాగుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వడ్డెరలు బీసీ వర్గంలోనే కొనసాగుతూ ఇంకా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ వడ్డెర సమాజం రాళ్ల పనులు, కూలీ పనులు, భూమి తవ్వకాల వంటి కఠిన శ్రమ ఆధారిత వృత్తులపైనే ఆధారపడి జీవిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా వడ్డెర సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అభివృద్ధి పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News