Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:22 PM

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు
May 11, 2026 11:52 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వడ్డెర జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దండగల మారెప్ప, ప్రధాన కార్యదర్శి గోగుల చక్రపాణి ఆంధ్రప్రదేశ్ బీసీ గ్రామీణ, పట్టణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ విశ్వ ఐఏఎస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రంలో వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చడంతో పాటు, వడ్డెర, వడ్డీలు, వడ్డీ తదితర ఉపవర్గాలన్నింటినీ ఒకే జాతిగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పేర్లు భిన్నంగా ఉన్నప్పటికీ, వీరందరూ ఒకే వడ్డెర సమాజానికి చెందిన వారేనని వివరించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో వడ్డెర జాతికి చెందిన వారు ఎస్.సి లేదా ఎస్.టి వర్గాల్లో కొనసాగుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వడ్డెరలు బీసీ వర్గంలోనే కొనసాగుతూ ఇంకా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ వడ్డెర సమాజం రాళ్ల పనులు, కూలీ పనులు, భూమి తవ్వకాల వంటి కఠిన శ్రమ ఆధారిత వృత్తులపైనే ఆధారపడి జీవిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా వడ్డెర సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అభివృద్ధి పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News