డెడికేటెడ్ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు
Anjali
వడ్డెర జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దండగల మారెప్ప, ప్రధాన కార్యదర్శి గోగుల చక్రపాణి ఆంధ్రప్రదేశ్ బీసీ గ్రామీణ, పట్టణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ విశ్వ ఐఏఎస్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
వినతి పత్రంలో వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చడంతో పాటు, వడ్డెర, వడ్డీలు, వడ్డీ తదితర ఉపవర్గాలన్నింటినీ ఒకే జాతిగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పేర్లు భిన్నంగా ఉన్నప్పటికీ, వీరందరూ ఒకే వడ్డెర సమాజానికి చెందిన వారేనని వివరించారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో వడ్డెర జాతికి చెందిన వారు ఎస్.సి లేదా ఎస్.టి వర్గాల్లో కొనసాగుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వడ్డెరలు బీసీ వర్గంలోనే కొనసాగుతూ ఇంకా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ వడ్డెర సమాజం రాళ్ల పనులు, కూలీ పనులు, భూమి తవ్వకాల వంటి కఠిన శ్రమ ఆధారిత వృత్తులపైనే ఆధారపడి జీవిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా వడ్డెర సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అభివృద్ధి పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి