Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:20 AM

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం
March 17, 2026 04:52 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో కోదాడ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమం 18-03-2026 (బుధవారం) నాడు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు బస్సు సేవలకు సంబంధించిన తమ సమస్యలు, సూచనలు మరియు అభిప్రాయాలను నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించబడింది.

ప్రయాణికులు ఫోన్ నంబర్: 99592 26307 కు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు మరియు సూచనను పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈ “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

కాబట్టి కోదాడ డిపో పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News