Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:38 AM

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం
17-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో కోదాడ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమం 18-03-2026 (బుధవారం) నాడు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు బస్సు సేవలకు సంబంధించిన తమ సమస్యలు, సూచనలు మరియు అభిప్రాయాలను నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించబడింది.

ప్రయాణికులు ఫోన్ నంబర్: 99592 26307 కు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు మరియు సూచనను పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈ “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

కాబట్టి కోదాడ డిపో పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు కోరారు.

Sthanikam

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

Article Image

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో కోదాడ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమం 18-03-2026 (బుధవారం) నాడు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు బస్సు సేవలకు సంబంధించిన తమ సమస్యలు, సూచనలు మరియు అభిప్రాయాలను నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించబడింది.

ప్రయాణికులు ఫోన్ నంబర్: 99592 26307 కు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు మరియు సూచనను పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈ “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

కాబట్టి కోదాడ డిపో పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News