డయల్ యువర్ డీఎం కార్యక్రమం
డయల్ యువర్ డీఎం కార్యక్రమం
Harish HS
డయల్ యువర్ డీఎం కార్యక్రమం
ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కోదాడ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమం 18-03-2026 (బుధవారం) నాడు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు బస్సు సేవలకు సంబంధించిన తమ సమస్యలు, సూచనలు మరియు అభిప్రాయాలను నేరుగా డిపో మేనేజర్కు ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించబడింది.
ప్రయాణికులు ఫోన్ నంబర్: 99592 26307 కు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు మరియు సూచనను పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈ “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
కాబట్టి కోదాడ డిపో పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి