దావత్లకు సంబంధం లేని వారికి హెచ్చరిక
దావత్లకు సంబంధం లేని వారికి హెచ్చరిక
Editor Desk
వెళ్తే 3 నెలల జైలు, రూ.5 వేల జరిమానా: ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో జరిగే వివాహాలు, దావత్లు, ఇతర వేడుకలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాయి.
ఇటీవల పలు ఫంక్షన్ హాల్స్ వద్ద “సంబంధం లేని వ్యక్తులు దావత్లకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేశారు.
వేడుకలకు సంబంధం లేకుండా వచ్చి భోజనం చేయడం వల్ల నిర్వాహకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే ఆహార వృథా, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు హెచ్చరికగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ బోర్డులు చూసిన స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం వార్తల్లో రావడంతో మరిన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి