Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:37 PM

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక
10-03-2026 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెళ్తే 3 నెలల జైలు, రూ.5 వేల జరిమానా: ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో జరిగే వివాహాలు, దావత్‌లు, ఇతర వేడుకలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాయి.

ఇటీవల పలు ఫంక్షన్ హాల్స్ వద్ద “సంబంధం లేని వ్యక్తులు దావత్‌లకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేశారు.

వేడుకలకు సంబంధం లేకుండా వచ్చి భోజనం చేయడం వల్ల నిర్వాహకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే ఆహార వృథా, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు హెచ్చరికగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్డులు చూసిన స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం వార్తల్లో రావడంతో మరిన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Sthanikam

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

Article Image

వెళ్తే 3 నెలల జైలు, రూ.5 వేల జరిమానా: ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో జరిగే వివాహాలు, దావత్‌లు, ఇతర వేడుకలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాయి.

ఇటీవల పలు ఫంక్షన్ హాల్స్ వద్ద “సంబంధం లేని వ్యక్తులు దావత్‌లకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేశారు.

వేడుకలకు సంబంధం లేకుండా వచ్చి భోజనం చేయడం వల్ల నిర్వాహకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే ఆహార వృథా, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు హెచ్చరికగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్డులు చూసిన స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం వార్తల్లో రావడంతో మరిన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News