Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం
February 19, 2026 07:22 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల ప్రారంభం – విద్యాభివృద్ధికి తోడ్పాటు

సూర్యాపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు సహకరించిన దాతలు మేడిగ ఈశ్వర్ కుమార్, శైలజల సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించడం ప్రశంసనీయమన్నారు. త్రి శక్తి వనిత సమూహం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు.విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దాతలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజా, రవిబాబు, గుండా రమేష్, రాచకొండ శ్రీనివాస్, తేలుకుంట్ల వెంకన్న, రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు, త్రి శక్తి వనిత సమూహం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News