Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:32 PM

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం
February 19, 2026 07:22 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

ప్రభుత్వ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల ప్రారంభం – విద్యాభివృద్ధికి తోడ్పాటు

సూర్యాపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు సహకరించిన దాతలు మేడిగ ఈశ్వర్ కుమార్, శైలజల సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించడం ప్రశంసనీయమన్నారు. త్రి శక్తి వనిత సమూహం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు.విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దాతలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజా, రవిబాబు, గుండా రమేష్, రాచకొండ శ్రీనివాస్, తేలుకుంట్ల వెంకన్న, రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు, త్రి శక్తి వనిత సమూహం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News