PRINT TIME: April 08, 2026 06:32 PM
డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్కు వినతి
డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్కు వినతి
April 08, 2026 04:18 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాలనీ ప్రజలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్హెచ్–65 రహదారిపై అవసరమైన చోట్ల కల్వర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణాలు, గృహాలకు తాగునీటి పైప్లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా ఇరువైపులా ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన చోట్ల రోడ్డు కటింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ మేరకు తమ సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని చైర్మన్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి