డ్రగ్స్పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ
డ్రగ్స్పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ
GADDAM JAGANMOHAN REDDY
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం 16వ రోజు సందర్భంగా, ప్రజల విస్తృతంగా పాల్గొనుటతో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు ఈ ర్యాలీకి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్,మైలవరం ఎమ్మెల్యే వసంత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 01.00 గంటలకు ఎల్ హెచ్ ఆర్ హై స్కూల్ వద్ద ప్రారంభమై,అక్కడి నుండి సైకిల్ ర్యాలీగా లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 02.30 గంటల నుండి లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, యువతను డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నుండి రక్షించి,డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ,విద్యార్థులు,యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనవి మైలవరం పోలీస్ శాఖ వారు కోరుతున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి