Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:24 AM

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం
February 17, 2026 08:08 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిని కళాశాల నుండి అత్యంత వైభవంగా ప్రారంభమై శ్రీ వాహిని, వై జంక్షన్ తిరువూరు, గురుకుల పాఠశాల, సురవరం, రోలుపడి మీదుగా చింతలపాడు వరకు సాగింది. ఈ క్రమంలో ““డ్రగ్స్‌కు నో – జీవితం మాకు కావాలి! ” అనే నినాదంతో అలుపనెది లేకుండా అత్యంత వైభవంగా ర్యాలీ సాగింది

ఈ కార్యక్రమం రూరల్ డి.సి.పి. బి లక్ష్మి నారాయణ గారు, ఏ.సి.పి. ప్రసాద రావు గారి పర్యవేక్షణలో తిరువూరు ఇన్స్పెక్టర్ శ్రీ కె. గిరిబాబు గారు వారి సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రజా దారణతో రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ అత్యంత ఘనంగా సాగుతుంది. ఈ క్రమంలో సురవరం మరియు చింతలపాడు గ్రామాలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో విద్యార్థులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విశేష ఆధరణతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడతూ.....సమాజంలో లో జరిగే ప్రతి నేరం వెనుక మారకద్రవ్యం పాత్ర ఉంటుందని, దానిని సమాజానికి దూరంగా తరిమికొట్టడం వలన ఆదర్శమైన సమాజం ఏర్పడుతుందని, మారకద్రవ్యాలను విక్రయించే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ కావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సిరిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక నేతలు, సుమారు 1500 మంది వరకు అధ్యాపకులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News