“డ్రగ్స్కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం
“డ్రగ్స్కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిని కళాశాల నుండి అత్యంత వైభవంగా ప్రారంభమై శ్రీ వాహిని, వై జంక్షన్ తిరువూరు, గురుకుల పాఠశాల, సురవరం, రోలుపడి మీదుగా చింతలపాడు వరకు సాగింది. ఈ క్రమంలో ““డ్రగ్స్కు నో – జీవితం మాకు కావాలి! ” అనే నినాదంతో అలుపనెది లేకుండా అత్యంత వైభవంగా ర్యాలీ సాగింది
ఈ కార్యక్రమం రూరల్ డి.సి.పి. బి లక్ష్మి నారాయణ గారు, ఏ.సి.పి. ప్రసాద రావు గారి పర్యవేక్షణలో తిరువూరు ఇన్స్పెక్టర్ శ్రీ కె. గిరిబాబు గారు వారి సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రజా దారణతో రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ అత్యంత ఘనంగా సాగుతుంది. ఈ క్రమంలో సురవరం మరియు చింతలపాడు గ్రామాలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో విద్యార్థులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విశేష ఆధరణతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడతూ.....సమాజంలో లో జరిగే ప్రతి నేరం వెనుక మారకద్రవ్యం పాత్ర ఉంటుందని, దానిని సమాజానికి దూరంగా తరిమికొట్టడం వలన ఆదర్శమైన సమాజం ఏర్పడుతుందని, మారకద్రవ్యాలను విక్రయించే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.
ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ కావాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సిరిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక నేతలు, సుమారు 1500 మంది వరకు అధ్యాపకులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి