Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం
February 17, 2026 08:08 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిని కళాశాల నుండి అత్యంత వైభవంగా ప్రారంభమై శ్రీ వాహిని, వై జంక్షన్ తిరువూరు, గురుకుల పాఠశాల, సురవరం, రోలుపడి మీదుగా చింతలపాడు వరకు సాగింది. ఈ క్రమంలో ““డ్రగ్స్‌కు నో – జీవితం మాకు కావాలి! ” అనే నినాదంతో అలుపనెది లేకుండా అత్యంత వైభవంగా ర్యాలీ సాగింది

ఈ కార్యక్రమం రూరల్ డి.సి.పి. బి లక్ష్మి నారాయణ గారు, ఏ.సి.పి. ప్రసాద రావు గారి పర్యవేక్షణలో తిరువూరు ఇన్స్పెక్టర్ శ్రీ కె. గిరిబాబు గారు వారి సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రజా దారణతో రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ అత్యంత ఘనంగా సాగుతుంది. ఈ క్రమంలో సురవరం మరియు చింతలపాడు గ్రామాలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో విద్యార్థులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విశేష ఆధరణతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడతూ.....సమాజంలో లో జరిగే ప్రతి నేరం వెనుక మారకద్రవ్యం పాత్ర ఉంటుందని, దానిని సమాజానికి దూరంగా తరిమికొట్టడం వలన ఆదర్శమైన సమాజం ఏర్పడుతుందని, మారకద్రవ్యాలను విక్రయించే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ కావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సిరిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక నేతలు, సుమారు 1500 మంది వరకు అధ్యాపకులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News