Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:43 AM

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి ;

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి ;

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి  ;
January 08, 2026 12:10 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి, ప్రతినిధి


డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాషా పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో, ఏర్పాటుచేసిన ర్యాలీలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టు నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ...యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.


యువత డ్రగ్స్‌తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్‌ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులకు చదువుతో పాటు నమస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని పేరొన్నారు. తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ... డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ పనిచేయాలని, డ్రగ్స్‌ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని, సైబర్‌ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సీఐ రజిత, ఎస్సై క్రాంతి కుమార్, ఎక్సైజ్ ఎస్సైల న్యాయవాదులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News