Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:50 AM

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి ;

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి ;

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి;సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష ఉద్యమించాలి  ;
January 08, 2026 12:10 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి, ప్రతినిధి


డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాషా పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో, ఏర్పాటుచేసిన ర్యాలీలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టు నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ...యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.


యువత డ్రగ్స్‌తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్‌ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులకు చదువుతో పాటు నమస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని పేరొన్నారు. తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ... డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ పనిచేయాలని, డ్రగ్స్‌ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని, సైబర్‌ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సీఐ రజిత, ఎస్సై క్రాంతి కుమార్, ఎక్సైజ్ ఎస్సైల న్యాయవాదులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News