Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:09 PM

డ్రగ్స్ గురించి అవగాహనా కార్యక్రమం

డ్రగ్స్ గురించి అవగాహనా కార్యక్రమం

డ్రగ్స్ గురించి అవగాహనా కార్యక్రమం
February 21, 2026 10:24 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Bramhanapalli
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా, ఎస్ పి ఆదేశాల మేరకు డ్రక్స్ వద్దు బ్రో ,రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు ,పిల్లలపై లైంగిక వేధింపులు , నూతన చట్టాలు వంటి వాటిపై శనివారం పరిగి మండలంలోని సేవా మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లెక్సీల రూపంలో చిత్రీకరించిన బొమ్మల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహి

ఈ కార్యక్రమానికి పెనుగొండ డిఎస్పి నర్సింగప్ప, తాసిల్దార్ హసీనా సుల్తాన,సి ఐ రాఘవన్, ఎస్సై రంగడు యాదవ్ లు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ...

విద్యార్థి దశలో ప్రతి ఒక్కరు చెడు అలవాట్లవైపు వెళ్ళకూడదు అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మంచి మార్గంలో నడవాలన్నారు. ప్రధానంగా డ్రగ్స్ రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పిస్తూ,నేరాలకు దూరంగా ఉంటే కుటుంబం ఏ విధంగా ఉంటుంది. నేరాలకు పాల్పడితే కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయనే వాటిపై తెలియజేశారు. అదే విధంగా ఫ్లెక్సీలలో బొమ్మల రూపంలో ఏర్పాటు చేయించి వాటి వల్ల కలిగే పరిస్థితులు ,డ్రగ్స్ మరియు ఇతర వాటికి అలవాటు పడితే ఆరోగ్యం, జీవితాలు ఏ విధంగా దెబ్బతింటాయి. డ్రగ్స్ జోలికి వెళ్లకపోతే ఏ విధంగా ఉంటుందనేదానిపై అవగాహన కల్పించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలకు గురవుతారని ఇందులో తెలియజేశారు. అదేవిధంగా హెల్మెట్లు లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల సంభవిస్తే మరణించడమే కాకుండా కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో తెలియజేసే విధంగా చిత్రాల ద్వారా చూపించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

#spsathishkumarips

#ssspolice

#APPOLICE100

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News