న్యాల్కల్,
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని డప్పర్ గ్రామంలో బుధవారం బీదర్ షాలిన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బురుజు జగదాంబ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ సైదులు, రేఖ, మౌనిక తదితరులు గ్రామంలోని దాదాపు 100 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో గుర్తించిన 18 మంది రోగులకు ఈ నెల 25న బీదర్లోని షాలిన్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, రాజు, సలీం, పండరి గౌడ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి