దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు
దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు
Vikram
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధింపు: జిల్లా ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
ప్రజల రవాణా అవసరాల కోసం ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు వెళ్లడం వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఈ విషయమై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడం, రోడ్లను తవ్వి వదిలేయడం వంటి చర్యల వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని అన్నారు. వ్యవసాయ పనులు లేదా ఇతర అవసరాల దృష్ట్యా ఎవరైనా రోడ్లను తవ్వాల్సి వచ్చినప్పుడు, సంబంధిత శాఖ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే రహదారులు తీవ్రంగా నష్టపోతాయని, ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు ఈ విషయాన్ని గమనించి దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకురావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి