Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు
January 22, 2026 05:59 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధింపు: జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రజల రవాణా అవసరాల కోసం ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు వెళ్లడం వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఈ విషయమై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడం, రోడ్లను తవ్వి వదిలేయడం వంటి చర్యల వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని అన్నారు. వ్యవసాయ పనులు లేదా ఇతర అవసరాల దృష్ట్యా ఎవరైనా రోడ్లను తవ్వాల్సి వచ్చినప్పుడు, సంబంధిత శాఖ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే రహదారులు తీవ్రంగా నష్టపోతాయని, ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు ఈ విషయాన్ని గమనించి దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకురావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News