Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి
01-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకడబూర్ మండలం బస్సులదొడ్డి గ్రామంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌ను వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఎంఆర్‌పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కర్నూలులోని సునయనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. బస్సులదొడ్డి గ్రామ సర్వే నంబర్‌ 89లోని 4.19 ఎకరాల భూమిని సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి కేటాయించిందన్నారు. అయితే ఆ భూమిలో 1.63 ఎకరాలను గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో డీఆర్ లంకరెడ్డి అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేయించి వెంచర్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార బలంతో రికార్డుల్లో మార్పులు చేసి, గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ వెంచర్‌ను రద్దు చేసి, దళితులకు కేటాయించిన 1.63 ఎకరాల భూమిపై పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, బాధితులు రాజశేఖర్, నరసింహులు, రామాంజి, ఆదాము, ఈరన్న, ప్రకాశం, ఆంజినేయులు, మరిదాసు, తిరుమల, దేవపుత్ర, యోహాను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

Article Image

పెద్దకడబూర్ మండలం బస్సులదొడ్డి గ్రామంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌ను వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఎంఆర్‌పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కర్నూలులోని సునయనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. బస్సులదొడ్డి గ్రామ సర్వే నంబర్‌ 89లోని 4.19 ఎకరాల భూమిని సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి కేటాయించిందన్నారు. అయితే ఆ భూమిలో 1.63 ఎకరాలను గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో డీఆర్ లంకరెడ్డి అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేయించి వెంచర్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార బలంతో రికార్డుల్లో మార్పులు చేసి, గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ వెంచర్‌ను రద్దు చేసి, దళితులకు కేటాయించిన 1.63 ఎకరాల భూమిపై పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, బాధితులు రాజశేఖర్, నరసింహులు, రామాంజి, ఆదాము, ఈరన్న, ప్రకాశం, ఆంజినేయులు, మరిదాసు, తిరుమల, దేవపుత్ర, యోహాను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News