Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి
June 01, 2026 05:52 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకడబూర్ మండలం బస్సులదొడ్డి గ్రామంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌ను వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఎంఆర్‌పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కర్నూలులోని సునయనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. బస్సులదొడ్డి గ్రామ సర్వే నంబర్‌ 89లోని 4.19 ఎకరాల భూమిని సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి కేటాయించిందన్నారు. అయితే ఆ భూమిలో 1.63 ఎకరాలను గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో డీఆర్ లంకరెడ్డి అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేయించి వెంచర్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార బలంతో రికార్డుల్లో మార్పులు చేసి, గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ వెంచర్‌ను రద్దు చేసి, దళితులకు కేటాయించిన 1.63 ఎకరాల భూమిపై పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, బాధితులు రాజశేఖర్, నరసింహులు, రామాంజి, ఆదాము, ఈరన్న, ప్రకాశం, ఆంజినేయులు, మరిదాసు, తిరుమల, దేవపుత్ర, యోహాను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News