దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
Biksham
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య డిమాండ్
మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ 7వ వార్డులో మొండి కత్తి జానకమ్మపై జరిగిన దాడి ఘటన బాధాకరమని, హేయనీయమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నల్లగొండ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.సామాజికంగా ఎదుగుదలను ఓర్చుకోలేక మాదిగ కులస్తురాలైన జానకమ్మపై కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన స్వప్న రెడ్డి, కొత్త శ్రీనుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు నీలకంఠం నాయక్, ధర్మ సమాజ్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తరి ఎల్లయ్య, జిల్లా నాయకుడు వెంకటేష్, మండల కార్యదర్శులు లక్ష్మణ్, హరికృష్ణ, సైదులు, శ్రీనివాస్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి