Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:17 AM

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
February 12, 2026 06:39 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య డిమాండ్

మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ 7వ వార్డులో మొండి కత్తి జానకమ్మపై జరిగిన దాడి ఘటన బాధాకరమని, హేయనీయమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నల్లగొండ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.సామాజికంగా ఎదుగుదలను ఓర్చుకోలేక మాదిగ కులస్తురాలైన జానకమ్మపై కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన స్వప్న రెడ్డి, కొత్త శ్రీనుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు నీలకంఠం నాయక్, ధర్మ సమాజ్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తరి ఎల్లయ్య, జిల్లా నాయకుడు వెంకటేష్, మండల కార్యదర్శులు లక్ష్మణ్, హరికృష్ణ, సైదులు, శ్రీనివాస్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News