Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
February 12, 2026 06:39 AM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య డిమాండ్

మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ 7వ వార్డులో మొండి కత్తి జానకమ్మపై జరిగిన దాడి ఘటన బాధాకరమని, హేయనీయమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నల్లగొండ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.సామాజికంగా ఎదుగుదలను ఓర్చుకోలేక మాదిగ కులస్తురాలైన జానకమ్మపై కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన స్వప్న రెడ్డి, కొత్త శ్రీనుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు నీలకంఠం నాయక్, ధర్మ సమాజ్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తరి ఎల్లయ్య, జిల్లా నాయకుడు వెంకటేష్, మండల కార్యదర్శులు లక్ష్మణ్, హరికృష్ణ, సైదులు, శ్రీనివాస్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News