దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం. ఈనెల 13న నల్లగొండ సభను విజయవంతం చేయాలి: టీఎస్ క్రిస్టఫర్
దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం. ఈనెల 13న నల్లగొండ సభను విజయవంతం చేయాలి: టీఎస్ క్రిస్టఫర్
Editor Desk
నల్లగొండ,
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేయాలనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, వారి రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉద్యమించాలని టీఎస్ క్రిస్టఫర్ పిలుపునిచ్చారు.
ఈనెల 13న నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని సువార్త నిలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీఎఫ్ నల్లగొండ కో-ఆర్డినేటర్ డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా నల్లగొండ పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులు, రోమన్ క్యాథలిక్ పాదర్లు, క్రైస్తవ సంఘాల పెద్దలు, ఉద్యోగులు, విశ్వాసులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను రద్దు చేసే ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. దళిత క్రైస్తవులకు న్యాయమైన హక్కులు, ఎస్సీ హోదా కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోమన్ క్యాథలిక్ శౌరయ్య, సీబీసీ జేమ్స్, పాస్టర్లు ప్రవీణ్, సమర్పణ కుమార్, మోసెస్, జాకబ్, ఫాదర్ జీవన్ కుమార్, చింత సుధాకర్, శ్రీను, యాకోబు, ప్రభుదాసు, రిటైర్డ్ హెచ్ఎం కొంపల్లి భక్షపతి, రిటైర్డ్ ఎస్సీఈ చిట్యాల పాల్ రాజు, మాచర్ల గిరి ప్రకాశ్, మాగి జోసెఫ్, మేడి లక్ష్మయ్య, సంజీవయ్య, దుబ్బ ప్రేమ్ కుమార్, ఆనందమయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి