Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది

డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది

డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది
February 14, 2026 05:04 AM 355 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ 16వ వార్డులో సిపిఎం కౌన్సిలర్ బత్తుల జయమ్మ-దాసు సంచలన విజయం

ప్రజల మనిషి రాజన్న కోటకు బీటలు.

కూలిన వెన్ రెడ్డి రాజు సామ్రాజ్యం.

సామాన్యుడి చేతిలో సంపన్నుడి ఓటమి.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ 16వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మున్సిపల్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ల అధ్యక్షుడు వెన్ రెడ్డి రాజు సతీమణి వెన్ రెడ్డి సంధ్య పై సిపిఎం నుంచి పోటీ చేసిన సామాన్య కార్యకర్త బత్తుల జయమ్మ-దాసు సంచలన విజయం సాధించారు.411 ఓట్ల మెజార్టీతో గొప్ప విజయాన్ని వార్డు ప్రజలు ఆమెకు అందించారు.కోట్ల రూపాయలు, విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగినప్పటికీ వాటిని లెక్కచేయకుండా సామాన్య సిపిఎం పార్టీ నాయకురాలిని గెలిపించారు. ఓటుకు-నోటుకు జరిగిన ఈ యుద్ధంలో ఓటే గెలిచింది.250 కోట్ల రూపాయలతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేశానని ప్రగల్బాలు పలికి, అసత్యాలు ప్రచారం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ను ప్రజలు నమ్మకుండా కోటిశ్వరుని లెక్కచేయకుండా పేదవాడి వైపు ప్రజల మొగ్గు చూపారు.డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది.స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడుగా భావించే రాజు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు సమాధానం లాంటిది.స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా మేల్కొని స్థానికంగా ఏం జరుగుతుందో గమనించాలని ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.కొంతమంది భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నాడని వాటిని మానుకోవాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు. గెలిచిన వారు భూ కబ్జాల వైపు వెళ్లకుండా గెలిపించిన వార్డు ప్రజలకు 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండు,చౌటుప్పల్ ఊర చెరువు భూములు కబ్జాలకు గురికాకుండా ప్రజలు,మేధావులు జాగ్రత్త వ్యవహరించాలని చర్చించుకుంటున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News