దక్షిణ వైసీపీలో చేరిన 33 వ వార్డు జనసేన వీర మహిళ, కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.
దక్షిణ వైసీపీలో చేరిన 33 వ వార్డు జనసేన వీర మహిళ, కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.
Sr.Journalist YVN
విశాఖపట్నం. 33వ వార్డుకు చెందిన జనసేన వీర మహిళ వాడపర్తి కనక రత్నం దక్షిణ వైయస్ఆర్సీపీలోకి చేరారు. సోమవారం డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మళ్లీ రావాలని కోరుకుంటూ వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న నిర్విరామ సేవలు, దక్షిణ నియోజకవర్గంలో అందించిన అభివృద్ధి, కార్యకర్తల అభివృద్ధికి, ప్రజా సేవకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎటువంటి ఎన్నికలైనా ఎగిరేది వైసిపి జెండా అని, ప్రజల కోరుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ తుంగలో తొక్కారన్నారు. విద్యా , వైద్యం, ఉపాధి అందించడంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో 33 వ వార్డు అధ్యక్షులు ముత్తా బత్తుల రమేష్, సౌత్ పరిశీలకులు వీసాల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము మరియు జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి