Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:24 PM

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

 డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం
December 27, 2025 04:39 PM 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం – సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

నల్గొండ – స్థానిక ప్రతినిధి

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎర్రయ్య స్మారక హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం తండా సర్పంచ్‌గా గెలిచిన సరస్వతి రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ… యువజన, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ధన బలం ముందు ప్రజా బలంతో గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులు అభినందనీయులని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువకులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నాయకులు ఖమ్మంపాటి అంజి, ఆదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News