Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:50 AM

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

 డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం
27-12-2025 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం – సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

నల్గొండ – స్థానిక ప్రతినిధి

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎర్రయ్య స్మారక హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం తండా సర్పంచ్‌గా గెలిచిన సరస్వతి రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ… యువజన, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ధన బలం ముందు ప్రజా బలంతో గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులు అభినందనీయులని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువకులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నాయకులు ఖమ్మంపాటి అంజి, ఆదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.


Sthanikam

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

Article Image

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం – సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

నల్గొండ – స్థానిక ప్రతినిధి

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎర్రయ్య స్మారక హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం తండా సర్పంచ్‌గా గెలిచిన సరస్వతి రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ… యువజన, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ధన బలం ముందు ప్రజా బలంతో గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులు అభినందనీయులని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువకులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నాయకులు ఖమ్మంపాటి అంజి, ఆదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News