Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:34 PM

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

 డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం
December 27, 2025 04:39 PM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం – సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

నల్గొండ – స్థానిక ప్రతినిధి

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎర్రయ్య స్మారక హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం తండా సర్పంచ్‌గా గెలిచిన సరస్వతి రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ… యువజన, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ధన బలం ముందు ప్రజా బలంతో గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులు అభినందనీయులని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువకులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నాయకులు ఖమ్మంపాటి అంజి, ఆదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News