డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి
డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి
Editor Desk
డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి
యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి