Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:48 PM

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి
December 19, 2025 06:54 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News