Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:54 PM

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
January 02, 2026 07:30 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కె. నరసింహ ఐపీఎస్, జిల్లా ఎస్పీ సూర్యాపేట

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్ సేఫ్టీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నెలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని, ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ఆప్తులను కోల్పోవద్దనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారం జిల్లా పోలీస్ సిబ్బంది గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, ప్రమాదకర జంక్షన్లు, జనసమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

డిఫెన్సివ్ డ్రైవింగ్, హెల్మెట్‌, సీటుబెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదనే అంశాలు, అరైవ్ సేఫ్ – అలైవ్’ నినాదం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News