Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:20 AM

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
January 02, 2026 07:30 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కె. నరసింహ ఐపీఎస్, జిల్లా ఎస్పీ సూర్యాపేట

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్ సేఫ్టీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నెలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని, ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ఆప్తులను కోల్పోవద్దనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారం జిల్లా పోలీస్ సిబ్బంది గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, ప్రమాదకర జంక్షన్లు, జనసమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

డిఫెన్సివ్ డ్రైవింగ్, హెల్మెట్‌, సీటుబెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదనే అంశాలు, అరైవ్ సేఫ్ – అలైవ్’ నినాదం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News