Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:37 PM

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం
December 16, 2025 07:21 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వార్డుల విభజనపై అభ్యంతరాలు

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డులు (డివిజన్లు) విభజనకు సంబంధించి ఇటీవల గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని వార్డుల భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డివిజన్ హద్దుల్లో తగిన మార్పులు–చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ కో–కన్వీనర్ భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత వార్డు విభజన వల్ల కొన్ని ప్రాంతాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని సరిహద్దులను పునఃసమీక్షించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ ముదిరాజ్‌తో పాటు ఆర్కె శ్రీనివాస్, వంశెట్టు శ్రీనివాస్, రామకృష్ణ, నరహరి తేజ, ప్రసన్న, రమేష్ గౌడ్, నాగరాజు, బాలచందర్ గౌడ్, రామదాసు ధనరాజ్, అంజలి, కిరణ్, ఆనంద్ గౌలికర్, లవ, సుదర్శిని, గణ, అనిల్ గుప్తా, భరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News