Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 AM

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం
December 16, 2025 07:21 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వార్డుల విభజనపై అభ్యంతరాలు

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డులు (డివిజన్లు) విభజనకు సంబంధించి ఇటీవల గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని వార్డుల భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డివిజన్ హద్దుల్లో తగిన మార్పులు–చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ కో–కన్వీనర్ భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత వార్డు విభజన వల్ల కొన్ని ప్రాంతాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని సరిహద్దులను పునఃసమీక్షించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ ముదిరాజ్‌తో పాటు ఆర్కె శ్రీనివాస్, వంశెట్టు శ్రీనివాస్, రామకృష్ణ, నరహరి తేజ, ప్రసన్న, రమేష్ గౌడ్, నాగరాజు, బాలచందర్ గౌడ్, రామదాసు ధనరాజ్, అంజలి, కిరణ్, ఆనంద్ గౌలికర్, లవ, సుదర్శిని, గణ, అనిల్ గుప్తా, భరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News