డైమండ్ జువెల్లర్స్లో అరుదైన వజ్ర ప్రదర్శన
డైమండ్ జువెల్లర్స్లో అరుదైన వజ్ర ప్రదర్శన
Biksham
గిన్నిస్ రికార్డు పొందిన ఎస్ డబ్ల్యు ఎ వజ్రాన్ని ప్రారంభించిన చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి
పట్టణంలోని డైమండ్ జువెల్లర్స్లో గిన్నిస్ రికార్డు పొందిన ఎస్ డబ్ల్యు ఎ వజ్ర ప్రదర్శనను సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేట ప్రజలకు అందుబాటు ధరల్లో బంగారు ఆభరణాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని షోరూం నిర్వాహకులకు సూచించారు. పట్టణ వ్యాపార అభివృద్ధికి ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, జ్యోతి కరుణాకర్, నాగులపాటి వాసు, బైరబోయిన శ్రీనివాస్, ఫరూక్, బండారు పద్మ పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులు తెడ్ల పురుషోత్తం, పొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, రాచకొండ శ్రీనివాస్, సిటీ యూనియన్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అరుదైన వజ్రాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి