Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం
January 13, 2026 08:55 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల పట్టణంలో 240 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు త్వరలోనే అందిస్తామని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం రోజున చిట్యాల పట్టణంలోని ఒకటో వార్డును ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివనేనిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ డంపింగ్ యార్డ్ ను జనావాసానికి దూరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేద ప్రజలు చాలామంది ఉన్నారని గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఒకరి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారని , ఈ మార్చి నెలలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఒకటో వార్డుకు కేటాయిస్తామని అన్నారు. వీటితోపాటు గ్రామంలో ఉన్న చెరువు పూడిక ను తీస్తామని చిట్యాలలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, చిట్యాల మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, పోకల దేవదాస్, చిన్న మల్లయ్య,, మారగోని ఆంజనేయులు,, గంగాపురం లింగస్వామి,, మల్లబోయిన మల్లేశం. గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News