Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:56 AM

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం
January 13, 2026 08:55 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల పట్టణంలో 240 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు త్వరలోనే అందిస్తామని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం రోజున చిట్యాల పట్టణంలోని ఒకటో వార్డును ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివనేనిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ డంపింగ్ యార్డ్ ను జనావాసానికి దూరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేద ప్రజలు చాలామంది ఉన్నారని గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఒకరి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారని , ఈ మార్చి నెలలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఒకటో వార్డుకు కేటాయిస్తామని అన్నారు. వీటితోపాటు గ్రామంలో ఉన్న చెరువు పూడిక ను తీస్తామని చిట్యాలలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, చిట్యాల మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, పోకల దేవదాస్, చిన్న మల్లయ్య,, మారగోని ఆంజనేయులు,, గంగాపురం లింగస్వామి,, మల్లబోయిన మల్లేశం. గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News